వర్సిటీల్లో ఘర్షణలు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

77చూసినవారు
వర్సిటీల్లో ఘర్షణలు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ
ఉద్యోగాల్లో కోటాపై బంగ్లాదేశ్ వర్సిటీల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ‘బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిటీకి చెందిన పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితులను వీలైనంత తగ్గించుకోండి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే హైకమిషన్, అసిస్టెంట్ కమిషన్స్‌ను సంప్రదించండి’ అని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్