ఇండోర్లోని బంగంగా ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. రాజా బాగ్ కాలనీలో సోమవారం రాత్రి ఇరుగు పొరుగు వారికి చిన్న విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలే 11వ తరగతి చదివే కోటేశ్వర్ చౌరే అనే విద్యార్థిని పొరుగు వారు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.