గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తాజాగా సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మకు సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.