హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 3 మండలాల్లో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.