నల్గొండ సభలో నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించి మాట్లాడారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి, దున్నపోతును తెచ్చుకున్నారని నిన్న కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ అన్నారు.