ఎంపీ ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్

15185చూసినవారు
ఎంపీ ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాద యాత్ర అందరినీ ఏకం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ వచ్చిందని, ఎంపీ ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. తమ వంద రోజుల పాలనకు ఈ ఫలితాలు రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశ్వీరదించారని, వంద రోజుల పాలనను మెచ్చుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని బీజేపీకి పనిచేసేలా కేసీఆర్ దిశానిర్ధేశం చేశారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్