నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి

561చూసినవారు
నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి
నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి రానున్నారు. ఇంద్రవెల్లిలో నేడు కాంగ్రెస్‌ భారీ బహిరంగసభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 1.30కి కేస్లాపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం చేరుకొని నాగోబా దేవస్థాన గోపురం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం చేస్తారు. నాగోబా నుంచి రోడ్డుమార్గాన ఇంద్రవెల్లి సభకు నేతలు చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్