సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తిరుపతికి వెళ్లనున్నారు. తన మనవడి తల నీలాల సమర్పించేందుకు సీఎం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేసి.. రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా నేడు సీఎం రేవంత్ హైదరాబాద్ బషీర్ బాగ్లో పరిశ్రమల భవన్ కు వెళ్లనున్నారు. పరిశ్రమలపై సమీక్ష అనంతరం ఆయన తిరుపతి బయల్దేరి వెళ్తారు.