సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన ఆయన, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.