ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా రైల్వే స్టేషన్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఢిల్లీ నుంచి కాన్పూర్కు దాదాపు 400 కిలోమీటర్లు రైలు మీద పడుకుని ప్రయాణించాడు. రైలు స్టేషన్కు చేరుకోగానే పైకప్పుపై పడి ఉన్న యువకుడిని చూసి ప్రజలు షాకయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పీఎఫ్ యువకుడిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో చూసిన అతనిపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.