ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు జూన్ ఒకటో తేదీ వరకూ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరారు. ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది.