ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 107 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ.. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. అలాగే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.