గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ తాజాగా సమాధానం ఇచ్చింది. 'మెయిన్స్ కు క్వాలిఫై కాని వారు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే అవకాశం పొందాలనుకుంటున్నారు. అభ్యర్థుల ఆందోళనల వెనుక ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్ లో చెప్పలేదు. సకాలంలో పరీక్ష జరగకపోతే నిజమైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుంది' అని పేర్కొంది.