ఏపీ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు

71చూసినవారు
ఏపీ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు
ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెలడించింది.

సంబంధిత పోస్ట్