మరోసారి మోసగించేందుకు వస్తున్నారు: కేటీఆర్

59చూసినవారు
మరోసారి మోసగించేందుకు వస్తున్నారు: కేటీఆర్
అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'ప్రజలను మోసం చేసి మరోసారి మోసగించేందుకు వస్తున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్నారు. బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి కాసాని. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యమై కాసానిని గెలిపించాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్