నీట్‌ పేపర్‌లో అవకతవకలపై కమిటీ

85చూసినవారు
నీట్‌ పేపర్‌లో అవకతవకలపై కమిటీ
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో కూడిన నివేదిక ఇస్తుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) డీజీ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్