ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ

70చూసినవారు
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
రిజర్వ్‌ బ్యాంక్‌ అంబుడ్స్‌మన్‌ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్‌/ఎల్రక్టానిక్‌ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్‌ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్‌బీఐ–సమీకృత అంబుడ్స్‌మన్‌ స్కీము కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్‌మన్‌ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్