రైతుల సమస్యలపై 25 నుంచి ఆందోళనలు

72చూసినవారు
రైతుల సమస్యలపై 25 నుంచి ఆందోళనలు
తెలంగాణలో రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేసింది. 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్