పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్

59చూసినవారు
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్
పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా క్వెట్టాలో మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. ఫాతిమా జిన్నా(32) అనే మహిళ ఈ వైరస్ బారినపడి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరినట్లు అక్కడి ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. రోగి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా నివాసి అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ వ్యాధి టిక్-బర్న్ నైరోవైరస్ వల్ల వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్