పీఎంకేఎస్వై ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై BRSనేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం 3 విడుతల్లో ఇచ్చేది రూ.6 వేలు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మందికిపైగా రైతులు ఉండగా, కేంద్రం గరిష్టంగా 36.1 లక్షల మంది రైతులకే అమలు చేసిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామన్నారు.