చైనాలో మీటూ ఉద్యమం చేపట్టిన ప్రఖ్యాత మహిళా జర్నలిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన ఘటనలో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం రోజున తీర్పును వెలువరించారు. సోఫియా హువాంగ్ జీకిన్ అనే జర్నలిస్టును కోర్టు దోషిగా తేల్చింది. పది నెలల క్రితం ఈ కేసులో విచారణ జరగ్గా, ఇప్పుడు తీర్పును ఇచ్చారు. లైంగిక వేధింపుల బాధితుల గురించి రిపోర్టింగ్ చేస్తూ 36 ఏళ్ల హువాంగ్ చైనాలో మీ టూ ఉద్యమాన్ని కొనసాగించారు.