తుక్కుగూడ సభకు సర్వం సిద్ధమైంది. అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చేవారి కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘పాంచ్ న్యాయ్’ పేరిట కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ ‘విజయభేరి’ సభ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు.