ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర.. అప్రమత్తమైన అధికారులు

59చూసినవారు
ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర.. అప్రమత్తమైన అధికారులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నుతున్నారన్న సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయా ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పోలీసు సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఆలయాల వద్ద భద్రతను పెంచాలని, అన్ని భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్