పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై గల అవినీతి కేసు విచారణను 17వ తేదీ వరకు పాక్లోని అకౌంటబిలిటీ కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖైదీగా వున్న అడియాలా జైల్లో భద్రతా పరమైన ఆందోళనలను ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాది ఆగస్టు నుండి రావల్పండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ వున్నారు. భద్రత లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలన్న జైలు సూపరింటెండెంట్ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించిందని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.