రోడ్డుపైనే సీపీఆర్‌.. బాలుడి ప్రాణాన్ని కాపాడిన డా.రవళి

573చూసినవారు
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. ఈనెల 5న విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఉలుకూ పలుకూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఏడుస్తూ బాలుడిని భుజంపై వేసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో మెడ్‌సీ ఆస్పత్రి డా.నన్నపనేని రవళి అటుగా వస్తూ.. వారిని గమనించి విషయం తెలుసుకున్నారు. బాలుడిని రోడ్డుపై పడుకోబెట్టి సీపీఆర్ చేసి ప్రాణాన్ని రక్షించారు.

సంబంధిత పోస్ట్