ప్రధాని నరేంద్ర
మోదీ నేతృత్వంలోని కొత్త కేబినెట్లో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. వీరిలో 19 మంది మంత్రులపై హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగాల వరకు తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే మరో ఐదుగురు మంత్రులపై ఐదుగురిపై మహిళల వేధింపుల కేసులు ఉన్నాయి.