ఘోరం.. గంటల వ్యవధిలో 600 మందిని నిలువునా కాల్చేశారు

55చూసినవారు
ఘోరం.. గంటల వ్యవధిలో 600 మందిని నిలువునా కాల్చేశారు
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని ఉగ్రవాదులు పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ రెబల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్