లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ తెలిపింది. దిగువ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నవారు నమోదు కావడం ఇదే మొదటిసారి.