వర్షాకాలం నుంచే పంటల బీమా: తుమ్మల

74చూసినవారు
వర్షాకాలం నుంచే పంటల బీమా: తుమ్మల
వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి పంట బీమా అమలవుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ వేసవిలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రూ.15 కోట్ల పరిహారం అందించామన్నారు. ఏప్రిల్, మేలో జరిగిన పంట నష్టానికి పరిహారం అందించేందుకు నివేదిక సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్