తిరుమలలో భక్తుల రద్దీ

60చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల కొండపై గురువారం భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక, బుధవారం శ్రీవారిని 67,320 మంది భక్తులు దర్శించుకోగా, 27,919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్