తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

75చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే భక్తులకు దొరుకుతున్నాయి. 300 రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం కేవలం గంటలోనే పూర్తవుతోంది. కాగా నిన్న తిరుమల శ్రీవారిని 64,802 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం నిన్న 3.66 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్