తిరుమల ప్రసాదంలో జెర్రీ

73చూసినవారు
తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి క‌ల‌కల‌కం రేపింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి క‌నిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భ‌క్తులు ప్ర‌శ్నించారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అక్క‌డ్నుంచి భ‌క్తులను వెళ్లిపోమ‌న్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌కులైక‌న వారిపై సీఎం చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్