రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో సీఎం మమేకమయ్యారు. మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన హయాంలోనే కర్నూలులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.