దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ అందుకుంది. తద్వారా మూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. భారత్ విజేతగా నిలవగానే ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో ఫ్యాన్స్ బాణసంచా పేల్చడంతో రూపమ్ షోరూమ్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పేశారు.