ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మొత్తం చాలా బాగా ఆడామని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ట్రోఫీని అందుకున్న రోహిత్ మాట్లాడుతూ.."ట్రోఫీ సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత కొన్నాళ్లుగా వైవిధ్యంగా ఆడుతున్నాం.. వాటి ఫలితాలే ఇప్పుడు చూస్తున్నాం. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకొని ఆడాలి. మొదటి ఐదారు ఓవర్లు ఎలా ఆడాలన్న దానిపై పూర్తి స్పష్టతతో బరిలోకి దిగాం. ఎనిమిదో స్థానంలో జడేజా బరిలోకి దిగడం జట్టుకు బాగా కలిసొచ్చింది." అని అన్నారు.