ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సాధించిన విజయాన్ని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత అభిమానులకు అంకితమిచ్చారు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ.. "అదృష్టవశాత్తు నా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. కేఎల్ రాహుల్, హార్దిక్ అద్భుతంగా ఆడారు. నాకు ఫేవరెట్ ట్యాగ్లపై నమ్మకం లేదు. కానీ మేము అద్భుతంగా రాణిస్తున్నాం.
ఈ విజయం మా అభిమానులకు అంకితం. నలుగురు స్పిన్నర్లతో ఆడటం చాలా కష్టం. క్రెడిట్ అంతా రోహిత్ భాయ్దే" అని అన్నారు.