ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు

579చూసినవారు
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు
కేంద్ర బ‌డ్జెట్-2024లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. "2009 నుంచి 2014 వరకు ఏపీలో రైల్వేలకు రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.9138 కోట్లు కేటాయించారు. ఇది 10 శాతం రెట్టింపు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయింది." అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్