మణిపూర్‌లోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ (వీడియో)

54చూసినవారు
విద్యార్థుల నిరసనలతో మణిపూర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు, తౌబాల్ జిల్లాలు సహా మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌లో కుకీలకు, మెయితీలకు మధ్య జరుగుతున్న సంఘర్షణల్లో సెప్టెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. దీంతో విద్యార్థులు ఆగ్రహానికి గురై ఆందోళనలు చేపట్టారు. వారి నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు.

సంబంధిత పోస్ట్