తుపాను ఎఫెక్ట్.. ఒడిశాలో మూడు రోజుల పాటు పాఠశాలలు బంద్

80చూసినవారు
తుపాను ఎఫెక్ట్.. ఒడిశాలో మూడు రోజుల పాటు పాఠశాలలు బంద్
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలను అక్టోబర్ 23-25 తేదీల్లో మూసివేస్తున్నట్లు ఒడిశా విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేస్తామని ఇవాళ వివరించారు. తుపాను సమయంలో పాఠశాలలు మూసేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్