కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కబాబ్లలో రంగు కోసం ఉపయోగించే ఫుడ్ కలర్స్పై నిషేధం విధించింది. వెజ్-నాన్ వెజ్ కబాబ్స్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే కబాబ్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించింది. ఇవి నాసిరకంగా ఉన్నాయని గుర్తించిన అధికారులు కృత్రిమ రంగులపై నిషేధం విధించారు.