స్పీకర్ ఎన్నికపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవిపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో విపక్ష నేతలు కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలు సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఎన్డీయే నుంచి స్పీకర్ అభ్యర్ధిని బరిలో నిలుపుతున్నామని, విపక్షాల మద్దతు అవసరమని రాజ్నాథ్ సింగ్ వారిని కోరారు. కాగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్ధిగా ఓంబిర్లా తలపడుతుండగా, విపక్షాల నుంచి కే.సురేష్ బరిలో నిలిచారు.