ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో భక్తుల మరణవార్త హృదయవిదారకం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది.