రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికా మర్చెంట్ పెళ్లిసందడి హాట్టాపిక్గా మారింది. ఈ వేడుకల్లో భాగంగా 50 పేద జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. కొత్త జంటలకు భారీగా కానుకలు అందించారు. బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు, పెళ్లికుమార్తెకు స్త్రీధనంగా రూ.1.01 లక్షల చెక్, ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు.