మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా వింత ఘటన చోటుచేసుకుంది. మే 2న జ్యోతి శర్మ అనే వివాహిత అదృశ్యమైంది. అయితే మే 4న పొలంలో కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను జ్యోతిగా గుర్తించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. హత్యా నేరం కింద జ్యోతి భర్త సునీల్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా ఆమె ఖాతా నుంచి రూ.2700 డ్రా అయ్యాయి. ఈ విషయం భర్త సునీల్కు తెలిసి దర్యాప్తు చేయగా జ్యోతి ఈ డబ్బును నోయిడాలో విత్డ్రా చేసినట్లు తేలింది.