తిన్న కంచంలో చెయ్యి కడగకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే.. ఆహారాన్ని లక్ష్మీదేవీ, అన్నపూర్ణ దేవిగా భావిస్తారు. అయితే, తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఈ దేవతలకు కోపం వస్తుందని హిందువులు నమ్ముతారు. అలాగే ఆహారం కూడా దొరకదని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదని భావిస్తారు. ప్లేట్లో మిగిలిపోయిన ఆహారాన్ని అగౌరవ పరిచినట్లు అవుతుందని చెబుతారు. అందుకే ఇలా చేయకూడదని పండితులు కూడా చెబుతుంటారు.