ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 122 మంది మృతి చెందారు. 100 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన నేపథ్యంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సానుభూతి తెలిపారు. అలాగే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.