రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్‌

62చూసినవారు
రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్‌
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్