ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 18 పరుగులకు ఔట్ అయ్యారు. విప్రాజ్ నిగమ్ వేసిన 4.6వ బంతికి రోహిత్ LBWగా పెవిలియన్ చేరారు. అయితే అంపైర్ మొదట ఔట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో DC జట్టు రివ్యూ తీసుకోవడంతో థర్డ్ అంపైర్ రోహిత్ ను ఔట్గా ప్రకటించారు.