ఢిల్లీ నీటి సంక్షోభం పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతా: అతిశీ

80చూసినవారు
ఢిల్లీ నీటి సంక్షోభం పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతా: అతిశీ
దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడిపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని, రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకుంటే జూన్ 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆప్ మంత్రి అతిశీ హెచ్చరించారు. హర్యానా నీటి వాటాను విడుదల చేయనందున ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభంతో పోరాడుతోందన్నారు. 613 ఎంజీడీలకు గాను 513 ఎంజీడీల నీటిని మాత్రమే హర్యానా విడుదల చేసిందని తెలిపారు. 28,500 మందికి ఒక ఎంజీడీ నీరు అవసరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్