గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితోపాటు మరో ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లిందని కేసీఆర్కు రాసిన రాజీనామా లేఖలో శ్రీలత పేర్కొన్నారు.